అమ్మబాబోయ్..పిచ్చి కుక్క

by Naveena |
అమ్మబాబోయ్..పిచ్చి కుక్క
X

దిశ,సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సత్తుపల్లి పట్టణంలోని పలు వీధులలో సుమారు 30 మందికి పైగా పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. విద్యానగర్ రోడ్ నుంచి ఎస్బిఐ బ్యాంక్ వరకు ప్రధాన రహదారిపై పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. మారు 30 మందికి పైగా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందినట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఒక్క రోజులోనే పిచ్చికుక్క దాడిలో 30 మందికి పైగా గాయపడటంతో..పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపటి తరువాత మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, స్వైర విహారం చేస్తున్న కుక్కను చంపివేయటంతో ..స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed