పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి అదిరే అప్‌డేట్.. పవన్ పాడిన పాట వచ్చేస్తోంది

by karthikeya |   ( Updated:2024-10-12 14:56:42.0  )
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి అదిరే అప్‌డేట్.. పవన్ పాడిన పాట వచ్చేస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురు చేస్తున్న హరిహర వీరమల్లు నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పవన్ ఓ పాట పాడబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ‘‘పవన్ కల్యాణ్ పాడిన బ్యాటిల్ ఆఫ్ ధర్మ ఫస్ట్ సింగిల్‌ సాంగ్‌ను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉంటే పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్ కల్యాణ్ కొన్ని నెలలుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి డేట్స్ కూడా ఇవ్వలేదు. ఫైనల్‌గా అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మళ్ళీ డేట్స్ దొరకడంతో మూవీ టీం శరవేగంగా షూట్ పూర్తి చేస్తోంది. దీంతో రెగ్యులర్‌గా అప్డేట్స్ కూడా ఇస్తోంది. కాగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్‌లో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed