సింగవట్నం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

by Naveena |
సింగవట్నం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
X

దిశ,కొల్లాపూర్: పుణ్యక్షేత్రమైన కొల్లాపూర్ మండలం సంగపట్నం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి,రత్న లక్ష్మి అమ్మవారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. విజయ దశమి సందర్భంగా.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సతీష్ కుమార్ శర్మ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, విజయదశమి శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం కొల్లాపూర్ వరిదేలలోని శమీవృక్షం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి పూజించారు.కోటవీధిలోని శమీవృక్షం( జమ్మిచెట్టు)చెట్టు ప్రదక్షిణలు చేసి జమ్మి ఆకులను పెద్దలకు అందజేసి అశీర్వాదం తీసుకున్నారు.అలాగే పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ దంపతులు సైతం దుర్గాదేవీకి ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు.

Advertisement

Next Story

Most Viewed