ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని సంతాపం..

by Sumithra |
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని సంతాపం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో ప్రజలకు సేవ చేసిన నిఖార్సయిన నాయకుడిని కోల్పోయినట్లయిందని ఆయన కుటుంబానికి దేశ ప్రధాని నరేంద్రమోడి సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడి దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సతీమణి విజయలక్ష్మీకి సంతాప సందేశాన్ని పంపించారు.

ధర్మపురి శ్రీనివాస్ మరణంతో ప్రజల్లో గౌరవప్రదమైన నాయకుడిగా అనుభవశాలి నాయకుడిని కోల్పోవడం బాధకరమన్నారు. ఆయన మంత్రిగా, ప్రజాప్రతినిధిగా, రాజకీయాల్లో మచ్చలేని జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజలు ఎన్నడు మరిచిపోరని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రధాని తన సంతాప లేఖలో కోరారు.

Next Story

Most Viewed