విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి..

by Kalyani |
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి..
X

దిశ, మీర్ పేట్: ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల కు చెందిన వంశీ, మెట్ పల్లి కి చెందిన అభినవ్ లు ఆర్ ఎన్ రెడ్డి నగర్ టికేఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వంశీ, అభినవ్ తో కలిసి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంపై తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మందమల్లమ్మ చౌరస్తా నుండి మీర్ పేట్ వెళుతుండగా మార్గ మధ్యలో జిల్లెలగూడ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో వంశీ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన మరో యువకుడు అభినవ్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది .కేసు నమోదు చేసుకొని మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed