- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Vijaywada: పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల గడువు ముగియడంతో దరఖాస్తుల స్వీకరణకు విద్యార్థుల నుంచి అధికారులు రూ. 20 వేలు పెనాల్టీ వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీనే ఎక్కువగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెనాల్టీ లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా స్థాయిలో పీజీ అడ్మిషన్ల షెడ్యూల్ ఇంకా రాకపోయినా హెల్త్ యూనివర్సిటీ అధికారులు హడావుడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్వీనర్ కోటా అడ్మిషన్లను ముందుగా ఎందుకు ముగిస్తున్నారని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించకుండానే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.