పేకాట స్థావరంపై పోలీసుల రైడ్.. ఏడుగురి అరెస్ట్

by Aamani |
పేకాట స్థావరంపై పోలీసుల రైడ్.. ఏడుగురి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్,కస్తూర్బా కాలనీలోని ఇంట్లో నిర్వహించబడుతున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించారు. 7 గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, రూ. 30,500 లు నగదును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ కు నిందితులను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూ శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్స్ లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed