పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by Naveena |
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ,నిజాంసాగర్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..పేకాట ఆడుతున్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. నిందితుల నుంచి రూ"18,440 నగదు,ఐదు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత పేకాట, క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ ఆడుతూ..యువత భవిష్యత్తు జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పేకాటలో ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. మండలంలోని గ్రామాలలో బెట్టింగ్,పేకాటలకు పాల్పడితే.. వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed