అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లుః ఎమ్మెల్యే మదన్ మోహన్

by Nagam Mallesh |
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లుః ఎమ్మెల్యే మదన్ మోహన్
X

దిశా, ఎల్లారెడ్డిః అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో సోమార్పేట్ రహదారిలో నిర్మాణమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంను ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతోమంది పేద ప్రజలు ఇండ్లు లేక జీవిస్తున్నారని.. కనీసం కొంతమందికైనా తన వంతు సహాయం చేయాలని సంకల్పంతో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశించారు. పనులు పూర్తికావడంతో, సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను నేరుగా ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన వారికి 20 రోజుల్లోపే అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి సామెల్, గయాజుద్దీన్, మాజీ సర్పంచులు, పప్పు వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, వినోద్ గౌడ్ నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed