- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం
దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పసుపు రైతులకు ఇచ్చిన మాట కోసం ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో నిలబెట్టు కున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు.
మహిళా సాధికారత బీజేపీతోనే సాధ్యమని, మహిళ నైనా తనను బాల్కొండ నియోజకవర్గం లోని ప్రజలు ఆశీర్వదించి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముప్కాల్ మండలం కేంద్రానికి చెందిన ఏలేటి గంగాధర్ బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల ఖర్చుల నిమిత్తం 11,111 రూపాయలు చెక్కును అన్నపూర్ణమ్మ కి అందించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.