ఈజిప్టులో బస్సు ప్రమాదం..12మంది యూనివర్సిటీ విద్యార్థుల మృతి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-15 08:47:56.0  )
ఈజిప్టులో బస్సు ప్రమాదం..12మంది యూనివర్సిటీ విద్యార్థుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈజిప్టులోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది యూనివర్సిటీ విద్యార్థులు దుర్మరణం చెందారు. హైవేపై వెళ్తున్న బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 12 మంది యూనివర్సిటీ విద్యార్థులు మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొంది. విద్యార్థులు అందరూ సూయజ్ బేస్డ్​ గలాలా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అని అధికారులు తెలిపారు.

యూనివర్సిటీ నుంచి వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో వెల్లడించలేదు. ఈజిప్టులో అధ్వాన్నమైన రోడ్లు, అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం వంటి వాటితో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Next Story