- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
పంట పొలాల్లో ఏనుగుల గుంపు హల్చల్.. రైతును పొలంలోనే తొక్కి చంపేసిన గజరాజులు
దిశ,వెబ్డెస్క్: ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పీలేరు మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో ఏనుగుల గుంపు రైతుపై దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో రైతు చిన్న రాజారెడ్డి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల నుంచి ఏనుగుల గుంపు నియోజకవర్గంలో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏనుగుల గుంపు వలన పచ్చని పొలాలు నాశనమవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి ప్రవేశించి హల్ చల్ చేస్తున్నాయి.
ఇదే క్రమంలో పుంగనూరు నుంచి పీలేరు వైపునకు వెళుతున్న ఆ ఏనుగుల గుంపు ఓ మామిడి తోటలోకి ప్రవేశించాయి. అయితే తన మామిడి తోపు దగ్గర కాపలాగా ఉన్న రైతు చిన్న రాజారెడ్డి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతని పై తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లతో తొక్కి, మట్టిలో కుక్కేసి రైతును దారుణంగా చంపేశాయి. ఈ ఘటన పీలేరులో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మరణించాడు. గజరాజుల నుంచి తమ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.