సారూ..ప్రమాదం జరగక ముందే స్పందించండి..

by Naveena |
సారూ..ప్రమాదం జరగక ముందే స్పందించండి..
X

దిశ,రాజపేట: మండలంలోని కాల్వపల్లి పొట్టి మరి వాగు రోడ్డుపై గుంత ఏర్పడింది. ఇటీవల గంధమల్ల చెరువుకు గోదావరి నీరు రావడంతో..పొట్టిమరి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 రోజులుగా వాగు ఉదృతి కి ప్రధాన రోడ్డు మీద బుంగ ఏర్పడింది. బేగంపేట బ్రిడ్జి మీద స్లాబ్ వెయ్యకపోవడంతో .. బేగంపేట వాసులు గంధ మల్ల గ్రామం నుంచి తిరిగి రాజపేట మండల కేంద్రానికి రావాల్సి వస్తున్నారని వాపోతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం కాంట్రాక్టర్ స్లాబ్ వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పొట్టి మరి వాగు రోడ్డు కూడా బుంగ పెద్దదై కొట్టుకుపోతే.. యాదగిరిగుట్ట వెళ్లే ప్రధాన మార్గం తెగిపోవడం ఖాయమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి.. రోడ్డుకు ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed