పండుగ సెలవుల్లో పాఠశాల వస్తువులు విధ్వంసం...

by Kalyani |
పండుగ సెలవుల్లో పాఠశాల వస్తువులు విధ్వంసం...
X

దిశ,తూప్రాన్ : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ఉండటంతో కొందరు ఆకతాయిలు పాఠశాలలో ఉన్న మిషన్ భాగీరథి వాటర్ పైప్ నల్లలు, డోర్ తాళాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. వివరాల ప్రకారం మనోహరబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో దసరా సెలవుల్లో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి అవి పని చేయకుండా రసాయనాలు పోసి రాక్షసానందం పొందారు. దేవుడి గుడిల చూసుకునే పాఠశాల ను ఇలా చేయడం పద్ధతి కదాని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

Next Story