పోచమ్మరేవు బ్రిడ్జికి నిధులు మంజూరు

by Naveena |   ( Updated:2024-10-17 08:53:52.0  )
పోచమ్మరేవు బ్రిడ్జికి నిధులు మంజూరు
X

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోచమ్మ బ్రిడ్జి కు నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. వంతెన నిర్మాణానికి 4.90 కోట్లతో రెండున్నర కిలోమీటర్ల పొడవుతో..నిధులు మంజూరు ఎమ్మెల్యే మదన్మోహన్ నిధులు మంజూరు చేయించారు. ఈ విషయమై మదన్మోహన్ అనుచరులను దిశ వివరణ కోరగా.. వాస్తవంగానే పోచమ్మ రేవు బ్రిడ్జి నిధులు మంజూరు అయ్యిందని తెలిపారు. మండల ప్రజల చిరకాల వాంఛ అయిన పోచమ్మ రేవు బ్రిడ్జిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సి ఆర్ ఆర్ ఫండ్స్ కింద ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు మదన్మోహన్ అనుచరులు తెలిపారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, ప్రజానీకం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Advertisement

Next Story