- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ లో ఎండు గంజాయి అమ్మకం దారుడి అరెస్ట్...
దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మిస్టర్ 360 రెస్టారెంట్ దగ్గర అక్రమంగా ఎండు గంజాయి అమ్ముతున్నరన్న విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మూర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్టీవెన్సన్ చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ కు చెందిన మహమ్మద్ వహీద్ అలీ అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద గల 800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితున్ని విచారించగా నాందేడ్ పట్టణం నుండి ఒక కిలో ఎండు గంజాయి తీసుకొచ్చి 200 గ్రాములుగా ఎండు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించినట్టు తెలిపారు.
ఎండు గంజాయిని విక్రయించగా మిగిలిన 800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ తెలిపారు. కాగా ఈ రెస్టారెంట్ పరిసర ప్రాంతాల్లో గంజాయిని సేవిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి వారిని పట్టుకుని ఆర్మూర్ తహసిల్దార్ గజనాన్ ముందు బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు ధర్మేందర్ ,సందీప్, వికాస్ గౌడ్ ,నరేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.