నాలుగు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

by Kavitha |
నాలుగు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
X

దిశ, కాగజ్ నగర్ : పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యమైంది. మహారాష్ట్ర టూ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికలపేట మండలం వద్ద ఎస్సై కొమురయ్య అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు లారీలలో మహారాష్ట్ర మీదుగా తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుండి పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు లారీలకు సంబంధించిన డ్రైవర్లలో ఇద్దరు పరారీ అయినట్లు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. పశువులను కాగజ్ నగర్ మండలం కోసిని గోశాలకు తరలించినట్లు తెలిపారు. ఎడ్లు, ఆవులు 100 కు పైగా ఉన్నట్లు తెలిపారు. వీటిని మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. పరారైన లారీ డ్రైవర్లను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Next Story

Most Viewed