మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త

by Y. Venkata Narasimha Reddy |
మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు అన్నివిధాలుగా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంగన్వాడీ నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది. నిర్వాసితుల ఇళ్లు సమీపంలో బాధిత పిల్లలు పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టింది. బాధితులను తరలించే విషయంలో బలవంతంగా కాకుండా బాధితులను ఒప్పించి, మరో ప్రాంతానికి తరలిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 25 టీములను ఏర్పాటు చేసింది.

మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే కుటుంబాల కోసం 16వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదీ గర్భంలో, బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కలిగినవారికి పునరావాసం కోసం వీటిని ఉపయోగిస్తారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. రివర్‌ఫ్రంట్‌లో సుమారు 10,200 మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతకు కాస్త ఎక్కువగానే.. 16వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అదనంగా కొత్తగా రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

Next Story

Most Viewed