ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో వ్యక్తి ఆత్మహత్య

by Naveena |
ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ : బోధన్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గుంతకల్ ప్యాసింజర్ రైల్లో ఓ వ్యక్తి మంగళ వారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి టవల్ తో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ ఐ సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ నవీన్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి ట్రైన్ లో ఊరి వేసుకొని ఉన్నట్లు, మృతుడి వద్ద అతని వివరాలు తెలిపే ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్ ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తు పడితే వెంటనే నెం. 8712658591 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

Next Story