MLA : మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం

by Kavitha |
MLA : మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం
X

దిశ, ఉప్పల్ : రామంతపూర్ కేసీఆర్ నగర్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా మూసీ బాధితుల ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని అన్నారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు మేమంతా వచ్చి అండగా నిలబడతామన్నారు. మూసీ సుందరీకరణ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ భరోసాఅని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, గంథం నాగేశ్వరరావు, బాబు యాదవ్, జహంగీర్, నరసింహ రెడ్డి, కొప్పు నర్సింగ్ రావు, చాంద్ పాషా, సురం శంకర్, స్వామీ, నరేష్, మనీష్, మందపాటి శ్రీనివాస్ రెడ్డి, సాగర్, మహేందర్, సంధ్య ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed