Maharashtra: సామూహిక ఆత్మహత్య కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

by Shamantha N |
Maharashtra: సామూహిక ఆత్మహత్య కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో సామూహిక ఆత్మహత్య కలకలం రేపింది. బుధవారం దంపతులు సహా వారి ఇద్దరు కుమారులు విగతజీవులుగా కన్పించారు. కాగా.. ఇది ఆత్మహత్య కేసుగా పోలీసులు భావిస్తున్నారు. మోవాడ్ గ్రామంలోని ఓ ఇంట్లోని కుటుంబసభ్యులు కన్పించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. మృతులను రిటైర్డ్ టీచర్ విజయ్ మధుకర్ పచోరి (68), అతని భార్య మాలా (55), వారి కుమారులు గణేష్ (38), దీపక్ (36)గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకన్నట్లు తెలిపారు.

సూసైడ్ నోట్ లభ్యం

ఇకపోతే, ఈ ఏడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లోని పాంధుర్నా పోలీస్ స్టేషన్‌లో గణేష్ అరెస్టయ్యాడు. మోసం కేసులో గణేష్ ని పోలీసులు అరెస్టు చేశఆరు. దీంతో, ఆ కుటుంబం మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ లోనే అదే లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. సూసైడ్ నోట్‌లో నలుగురు కుటుంబ సభ్యుల సంతకాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నార్ఖేడ్ పోలీసులు ఈ సామూహిక ఆత్మహత్యలను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed