దిశ ఎఫెక్ట్​ ... కలెక్టర్ హెచ్చరించడంతో హాజరైన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​ ... కలెక్టర్ హెచ్చరించడంతో హాజరైన అధికారులు
X

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రజావాణికి అన్ని ముఖ్య శాఖల అధికారులు గైర్హాజర్ అనే శీర్షికన ప్రచురించిన దిశ కథనానికి కలెక్టర్​ స్పందించారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కి హాజరుకావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. దీంతో ప్రజావాణిలో రద్దీ నెలకొంది.

అయితే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం తమకు ఏమీ పట్టనట్లు గా ప్రజావాణి కి గైర్హాజర్ అయ్యారు. ఈ విషయం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. హాజరైన అధికారులు కూడా ఫోన్లో నిమగ్నమైపోయారు. కలెక్టర్ మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed