కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా భగ్గుమన్న వర్గ విభేదాలు

by Sridhar Babu |
కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా భగ్గుమన్న వర్గ విభేదాలు
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మంగళవారం సాయంత్రం స్థానిక మునుర్కాపు సంఘంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం ఎదురైంది. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి వేదిక పైనే ఉన్న మాజీ మేయర్ సంజయ్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాట్లాడినప్పటికీ ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు ఆలస్యంగా సమావేశంకు వచ్చినప్పటికీ ఆయన్ని సంజయ్ కూర్చున్న సీట్లో కూర్చోపెట్టడాన్ని జీర్ణించుకోలేక వేదిక నుంచి కిందికి దిగి అవమానంతో ఇంటికి వెళ్లి పోయారు. సంజయ్ అనుచరులు సైతం సభ నుండి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed