electric shock : విద్యుత్ షాక్ తో బర్రె మృతి

by Naveena |
electric shock : విద్యుత్ షాక్ తో బర్రె మృతి
X

దిశ,గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్ తండాలో సోమవారం ఉదయం సమయంలో బర్రె విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు యజమాని తెలిపారు. ఈ సందర్భంగా యజమాని కాశీరాం మాట్లాడుతూ..సుమారు 50 వేల రూపాయల విలువగల బర్రె మరణించడంతో.. తనకు నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ తనకు న్యాయం చేయాలని తెలిపారు. అలాగే నష్టపరాన్ని ఇచ్చి.. ఆదుకోవాలని రైతు తన గోడ వ్యక్తం చేశారు.

Advertisement

Next Story