అమెరికాలో సూర్యాపేట వాసి అనుమానాస్పద మృతి..

by Nagam Mallesh |
అమెరికాలో సూర్యాపేట వాసి అనుమానాస్పద మృతి..
X

దిశ, సూర్యాపేట : అమెరికాలోని అట్లాంటాలో లెక్చరర్ గా పని చేస్తున్న సూర్యాపేట వాసి తప్సీ ప్రవీణ్ కుమార్(36)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం చనిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ అతని ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు ఆయన భార్య ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వారు సోమవారం మీడియాతో వెల్లడించారు. ఆత్మకూర్(ఎస్ )మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన తప్సీ నాగయ్య - సత్యవతి దంపతుల చిన్న కుమారుడు ప్రవీణ్. ఉన్నత చదువుల కోసం గ్రామంలో చిన్న కిరాణ దుకాణం పెట్టుకొని వచ్చిన ఆదాయంతో కుమారుణ్ణి ఉన్నత చదువులు చదించారు.ఈ క్రమంలో అతను గుజరాత్,సూరత్, సింగపూర్, మలేసియాలలో కొంతకాలం పలు కంపెనీలలో ఉద్యోగం చేసిన అతను గత 5 ఏళ్ల కిందట అమెరికాకు వెళ్ళాడు. అక్కడ ఓ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పని చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న అతను తన భార్యను తీసుకెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అధికారులు వెంటనే స్పందించి తన కుమారుని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని అతని తండ్రి వేడుకుంటున్నాడు.

Next Story

Most Viewed