కళాబృందంతో మత్తు పదార్థాలపై అవగాహన

by Naveena |
కళాబృందంతో మత్తు పదార్థాలపై అవగాహన
X

దిశ, నాగారం:మండల కేంద్రంలో సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలపై పోలీసుల కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, గంజాయి,డ్రగ్స్ మత్తు పదార్థాలు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ప్రజలు ఇంటర్నెట్ ను మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలన్నారు. సైబర్ మోసగాళ్ళు వేసే వలలో చిక్కుకొని మోసాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం పోలీసు కళాబృందం సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీసీ శ్రీనివాస్, లింగయ్య, వీరు, కళాబృందం వారు మరియు మండల ప్రజానీకం పాల్గొన్నారు.

Next Story