రోడ్డు ప్రమాదంలో టెక్నికల్ అసిస్టెంట్ మృతి

by Naveena |
రోడ్డు ప్రమాదంలో టెక్నికల్ అసిస్టెంట్ మృతి
X

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై మాచారెడ్డి మండలంలోని భవాని పేట మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ దుర్మరణం పాలయ్యారు. మాచారెడ్డి మండల ఉపాధి హామీ లో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జైల్ సింగ్ కామారెడ్డి నుంచి మాచారెడ్డికి వస్తుండగా..భవానిపేట వద్ద రోడ్డు పక్క తన బైక్ ఆపుకొని నిలబడి ఉండగా..మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో కాళ్లకు, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా మృతిచెందాడు. జై సింగ్ కు భార్య, మూడు సంవత్సరాల కూతురు ఉంది. అతని అకాల మరణం కుటుంబంలో తీగ విషాదం నింపింది.

Next Story