గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి వ్యక్తి మృతి

by Naveena |
గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి వ్యక్తి మృతి
X

దిశ ,మాడుగులపల్లి :మాడుగులపల్లి మండలంలోని నారాయణపురం గ్రామంలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి కొండయ్య గౌడ్(63) పై బుధవారం ఇంట్లో ఉండగా.. గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి కత్తులతో దాడి చేసి బజార్లో పడేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మార్గ మధ్యలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed