మునావర్ జమాను అరెస్టు చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-18 10:23:09.0  )
మునావర్ జమాను అరెస్టు చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన మహమ్మద్ బషీర్, రెహ్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారని, అయితే వారిని రెచ్చగొట్టిన మరో నిందితుడు మునావర్ జమాను ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అతడిని వెంటనే అరెస్టు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిందితులలో ఒకరిగా నమోదు చేసిన మునావర్ జమా ముంబైలో ఉంటాడని రాజాసింగ్ వెల్లడించారు. అతను ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి అమాయకుల మరణాలకు కారణమైన జాకీర్ నాయక్ మాదిరిగా రెండో జాకీర్ నాయక్ కావాలని కలలు కంటున్నాడని ఆరోపించారు.

మెట్రోపోలీస్ హోటల్లో మునవర్ జమా సమావేశానికి హాజరైన వారిని గుర్తించి, వారిని విచారించాలని, వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారన్న వివరాలను సంబంధిత రాష్ట్రాలకు పంపించాలని రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. మునావర్ జమా సమావేశానికి హాజరైన 150 మంది కూడా హిందు ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా విధ్వంసక చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును పోలీసులు, ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సరైంది కాదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed