సింగరేణి గురించి మాట్లాడడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి: MLA మక్కాన్ సింగ్ ఠాకూర్

by Satheesh |
సింగరేణి గురించి మాట్లాడడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి: MLA మక్కాన్ సింగ్ ఠాకూర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. సింగరేణి తెలంగాణకు ఆణిముత్యం అన్నారు. బీజేపీ గనుల వేలం పాటను ఖండిస్తున్నామన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణిని తీర్చిదిద్దారన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పైన మాట్లాడడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలన్నారు. బీజేపీతో కలిసి సింగరేణిని ప్రైవేటీకరణకు సహకరించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు.

గనుల వేలం పాటకు మద్దతుగా పార్లమెంట్‌లో అప్పటి బీఆర్ఎస్ ఎంపీలు వినోద్ రావు, కవిత,బాల్క సుమన్, నగేష్ మాట్లాడరని గుర్తు చేశారు. అధికారంలోకి రానప్పుడు సింగరేణి పైన కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, పవర్‌లోకి వచ్చాక అన్నీ మర్చిపోయారన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో బిడ్డింగ్ వేయడానికి సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. సింగరేణి కార్మికులను కేసీఆర్ అనేక సార్లు మోసం చేశాడన్నారు. రాష్ట్ర గనులన్నీ సింగరేణికి చెందాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed