Tulasi Reddy: జగన్‌తో సమాజానికి ప్రమాదం.. తులసిరెడ్డి హాట్ కామెంట్స్

by srinivas |
Tulasi Reddy: జగన్‌తో సమాజానికి ప్రమాదం.. తులసిరెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Late CM YS Rajasekhar Reddy) ఆస్తుల వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. తండ్రి ఆస్తుల వ్యవహారంలో అటు అన్న జగన్ (Jagan), ఇటు షర్మిల(Sharmila) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో రాజశేఖర్‌రెడ్డితో పని చేసిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. వైఎస్ షర్మిలకు మద్దతు పలికారు. వైఎస్ జగన్ తీరును తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తితో సమాజానికి ప్రమాదని చెప్పారు. జగన్‌కు డబ్బు, పదవి పిచ్చి ఎక్కువైందని విమర్శించారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా దిగజారతారని మండిపడ్డారు. జగన్ స్వార్థపరుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి ఆస్తుల విషయంలో సొంత తల్లినే కోర్టుకీడ్చారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. నవమాసాలు మోసిన తల్లిపై దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారన్నారు. జగన్‌కు తండ్రి, తల్లి, బాబాయ్, చెల్లి, హితులు, సన్నిహితులు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story