నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Aamani |
నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కలిసి విన్నవించారు. జోనల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో పార్కుల అభివృద్ధి, స్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. జోనల్ కమిషనర్ స్పందించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ చెన్నారెడ్డి, ఈ ఈ గోవర్ధన్ గౌడ్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed