MP Etela Rajender : సమిష్టి కృషితోనే కాలనీ అభివృద్ధి..

by Sumithra |
MP Etela Rajender : సమిష్టి కృషితోనే కాలనీ అభివృద్ధి..
X

దిశ, దుండిగల్ : సమిష్టి కృషితోనే కాలనీల అభివృద్ధి సాధ్యపడుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట లహరి గ్రీన్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృక్షో రక్షతి రక్షితః అనే థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె.పి.వివేకానందతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృధ్ధిలో ప్రజాప్రతినిధులతో పాటు కాలనీ వాసులంతా ఐకమత్యంగా పనిచేస్తే కాలనీ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ప్రదీప్ రావ్, భౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, లహరి గ్రీన్ పార్క్ అధ్యక్షులు శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు సిహెచ్.విష్ణు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెసరర్ రవీందర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed