Medak MLA : వైద్య కళాశాలలో అధునాతన వైద్యం

by Aamani |
Medak MLA : వైద్య కళాశాలలో అధునాతన వైద్యం
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ కు మెడికల్ కళాశాల అనుమతితో జిల్లా ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి వస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ అన్నారు. మెదక్ మెడికల్ కళాశాల కు కేంద్రం అనుమతి ఇవ్వడం పై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ కు మంజూరు అయిన మెడికల్ కళాశాల అనుమతి విషయమై ప్రత్యేకంగా చొరవ చూపడమే కాకుండా ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డుతో చర్చించి అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేశామని పేర్కొన్నారు. అదే విధంగా 2024-2025 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అదే విధంగా గత పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన ఎద్దేవ చేశారు. గత ప్రభుత్వం పదేండ్లుగా మెదక్ కు దగా చేసింది తప్పా ఒరగబెట్టింది ఏమిలేదని ఆయన అన్నారు. మెడికల్ కళాశాల విషయంలో గత పదేండ్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడం తప్ప... చేసింది ఏమీ లేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలే అయినా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించామని ఆయన అన్నారు. అదే విధంగా మెదక్ నియోజక వర్గంకు మంజూరు అయిన మెడికల్ కళాశాలకు అనుమతి లభించడం మెదక్ నియోజక వర్గ ప్రజలకు శుభపరిణామని తెలిపారు. మెడికల్ కళాశాల వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని, మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed