వైభవంగా ఆర్ద్రా మహోత్సవం..

by Sumithra |
వైభవంగా ఆర్ద్రా మహోత్సవం..
X

దిశ, కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో బుధవారం ఆర్ద్రా మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా సంతాన మల్లికార్జున స్వామివారికి సంతాన పాశుపత అభిషేకం, శ్రీ విజయదుర్గామాతకు విశేష పూజలు నిర్వహించారు.

ఉదయం 10 గంటల అనంతరం సంతాన పాశుపత హవనం పూర్ణాహుతి జరిగాయి. మోహనకృష్ణ శర్మ వేదవ్యాస్ శర్మ లక్ష్మణరావు వైదిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు గట్టు నర్సింహా రెడ్డి మల్లేశం, చీకోటీ మల్లికార్జున్ మర్యాలరవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed