కొల్లాపూర్ ఆర్డీఓ సస్పెన్షన్​

by Sridhar Babu |
కొల్లాపూర్ ఆర్డీఓ సస్పెన్షన్​
X

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ పి.నాగరాజు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఇక్కడ ఆర్డీఓగా నాగరాజు బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి భూములకు సంబంధించిన నకల్​, ఇతరత్రా పత్రాలు కావాలంటే సదరు రైతులకు సకాలంలో ఇవ్వకుండా వేధిస్తున్నట్టు రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రతి పనికి ఒక రేటు చొప్పున ఇక్కడి ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఇటీవల ఏసీబీ అధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్డీఓను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed