దేవరకద్రలో హైడ్రా ?

by Sridhar Babu |
దేవరకద్రలో హైడ్రా ?
X

దిశ, దేవరకద్ర : దేవరకద్రలో ఆక్రమణలకు గురవుతున్న సర్వే నంబర్ 542, 543, 545లోని కాకతీయుల కాలంనాటి మల్లెల పాపయ్య కుంటను శుక్రవారం దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్యతో పాటు మహబూబ్ నగర్ ఆర్డీఓ నవీన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నవీన్ మాట్లాడుతూ మల్లెల పాపయ్య కుంట ఆక్రమణకు గురవుతుందని, దాదాపు ఈ కుంట కింద 300 ఎకరాలు సాగవుతుందని తెలిపారు. కానీ ఈ కుంటను కొంతమంది ఆక్రమిస్తున్నారని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం చేపట్టిన హైడ్రా నేపథ్యంలో ఆయకట్టు దారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కుంటను అధికారులతో కలిసి సందర్శించినట్లు తెలిపారు. ఈ కుంట విస్తీర్ణం ఎంత ఉందో చూసి హద్దులు నిర్ణయించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కుంటలో ఏవైనా ఆక్రమణలు, నిర్మాణాలు ఉంటే చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల తహసీల్దార్ ఎల్లయ్య, ఆర్ఐ శరత్, ఇరిగేషన్ డీఈ చందు, రైతులు కొండాపురం అశోక్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed