- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి కేటీఆర్
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. హైదరాబాద్ అల్వాల్లోని ఎమ్మెల్యే సత్యం ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. తర్వాత సత్యం, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరలు ఉన్నారు.
కాగా, ఇటీవల ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి అనారోగ్య కారణాలతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కేటీఆర్ తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాలను పక్కనబెట్టి.. భార్యను కోల్పోయి దుఖంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించి ధైర్యం చెప్పడం రాజకీయాల్లో శుభపరిణామమని అంటున్నారు.