KTR: నాడు ఎవరెస్ట్.. నేడు అన్నమో రామచంద్ర.. గురుకులాల స్థితిపై కేటీఆర్ లెక్కలు

by Ramesh N |   ( Updated:2025-02-16 06:16:25.0  )
KTR: నాడు ఎవరెస్ట్.. నేడు అన్నమో రామచంద్ర.. గురుకులాల స్థితిపై కేటీఆర్ లెక్కలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా (Gurukulam) గురుకులాల (Gurukulas) పరిస్థితిపై ట్వీట్ చేశారు. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు, నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారని తెలిపారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే.. నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయన్నారు. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయని లెక్కలు వివరించారు.

ఏడాది పాలనలో 50 కి పైగా విద్యార్థులు (Food poisoning) ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని ఆరోపించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తుందని తెలిపారు. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపంగా మారిందని వెల్లడించారు.

Next Story

Most Viewed