అబద్ధాలు చెప్పడంలో కిషన్ రెడ్డి మోడీని మించిపోయారు: కూనంనేని సెటైర్

by Satheesh |
అబద్ధాలు చెప్పడంలో కిషన్ రెడ్డి మోడీని మించిపోయారు: కూనంనేని సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోడీని మించిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం సరికాదని అన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి నేతృత్వంలోనే సింగరేణి బొగ్గు గనులు వేలం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. సింగరేణిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న కలెక్టరేట్ల ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed