- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయం
![అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయం అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయం](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348173-nn.webp)
దిశ, హన్వాడ : ఫారెస్ట్ బీట్ అధికారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలో నిర్మించిన నివాస భవనాన్ని మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బీట్ ఆఫీసర్ నివాస భవనాన్ని ప్రారంభించారు. అనంతరం యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని, అడవుల సంరక్షణ కోసం అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కుని సమాజం బాగుండాలంటే అడవులు బాగుండాలనే ఆశయంతో బీట్ అధికారులు 24/7 పనిచేస్తున్నారని ఆయన వారిని అభినందించారు.
అనంతరం 75వ వన మహోత్సవం సందర్భంగా బీట్ ఆఫీసర్ నివాస భవనంలో, చిన్నదర్పల్లి ఫారెస్ట్ లో అధికారులు, ప్రజలతో కలిసి యెన్నం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,డిఎఫ్ఓ సత్యనారాయణ, పిడి డిఆర్డిఎ నర్సింహులు, ఎంపీపీ బాల్ రాజు, ఎంపిటిసి మునెమ్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, నాయకులు బి.సుధాకర్ రెడ్డి, లింగం నాయక్, శేఖర్ నాయక్, వెంకటాద్రి , వేముల కృష్ణయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.