ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

by Sridhar Babu |
ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి
X

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో జేవీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హోప్ మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని, తద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, అలవాల కరుణాకర్, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed