ఉపాధ్యాయులను వెంటనే నియమించండి.. ఎమ్మెల్యే..

by Sumithra |
ఉపాధ్యాయులను వెంటనే నియమించండి.. ఎమ్మెల్యే..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈవి నర్సింహ రెడ్డిని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే ఉపాధ్యాయులు లేని స్కూల్స్ లో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, అదనపు తరగతి గదులు నిర్మించాలని వినతి పత్రంలో అందజేశారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో గల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని నర్సింహా రెడ్డి ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed