MLA Koram Kanakaiah : రుణమాఫీ రైతులకు వరం

by Aamani |
MLA Koram Kanakaiah : రుణమాఫీ  రైతులకు వరం
X

దిశ,కామేపల్లి : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే న్యాయం జరుగుతుందని, రుణమాఫీ పథకం రైతులకు ఓ వరమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం పండితాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రుణమాఫీ సంబురాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతులకు పంట రుణాల నుంచి విముక్తి కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీని నెరవేరుస్తూ చారిత్రాత్మకమైన

అడుగు వేసింది అన్నారు.ఈ వేడుకలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి,డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏపూరి మహేంద్ర కుమార్,ఎస్ కె.ఫతేహమ్మద్, ధనియాకుల హనుమంతరావు,ఎంపీపీ బి.సునీత రాందాస్,భానోత్ సుజాత,డి. అనురాధ,చల్లా మల్లయ్య,దొడ్డ వేణు తదితరులు పాల్గొన్నారు.

Next Story