వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్

by Mahesh |
వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్
X

దిశ, ఖమ్మం సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కృష్ణ మహేష్ సేన జిల్లా ఇన్చార్జి పరుచూరి మురళి కృష్ణ ఆదేశానుసారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, మున్నేరు నది ప్రవాహం వల్ల ప్రజల జీవితాలు ఆగమ్య గోచరంగా మారాయి. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో వారం రోజుల పాటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోయిన ఆ ప్రజానీకం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు దేవభక్తిని కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో మున్నేరు నది పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మీకు అండగా మేమున్నాం, ఎవరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఏ విధంగా దివిసీమ ఉప్పెన నుంచి ఇప్పటివరకు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా ఆదుకున్నారో అదే విధానాన్ని ఖమ్మం జిల్లా అభిమానులు కూడా కొనసాగిస్తారన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం మాకు మా అభిమాన హీరోల నుండి ఆనవాయితీగా వచ్చింది. ఎక్కడ ఏ ఆపద ఉన్నా అక్కడ మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎవరూ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగారావు, నగర అధ్యక్షుడు మునగాల బాలు ,జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు చింత మల్ల గురుమూర్తి, నగర గౌరవ అధ్యక్షుడు నాగార్జునపు బ్రహ్మం, ఎన్ వెంకన్న, శివ ఆత్మకూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed