సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ ప్రారంభం..

by Sumithra |
సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ ప్రారంభం..
X

దిశ, కొత్తగూడెం : సీఎం కప్ - 2024 టార్చ్ రిలే ర్యాలీని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. సెంట్రల్ పార్క్ నుండి ప్రకాశం స్టేడియం వరకు టార్చ్ రిలే ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం యువత చెడు వ్యసనాలకు బారిన పడకుండా క్రీడల వైపు మొగ్గు చూపేలా ఉండటమే అని అన్నారు.

క్రీడల వలన శారీరక ఆరోగ్యంతో పాటు, మానసికంగా దృఢంగా ఉంటామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో కొనసాగుతున్న టార్చ్ ర్యాలీ 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకొని భద్రాద్రి కొత్తగూడెంకి చేరుకుందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ర్యాలీలో డీసీ ఎమ్మెస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed