- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఐఏఎస్లకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశం
దిశ, వెబ్డెస్క్: క్యాట్(CAT) తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్(IAS) అధికారులకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షాకిచ్చింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు. ఐఏఎస్లు అయినంత మాత్రాన స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని అభిప్రాయపడింది. ముందు వెళ్లి ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, క్యాట్ తీర్పు ప్రకారం ఇవాళే రిపోర్ట్ చేయాల్సి ఉంది.
కాగా, ఇటీవల డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల వీరంతా తమను యథావిధిగా బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని అక్కడ నిరాకరించడంతో తాజాగా బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ చేపట్టి.. ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.