Breaking: శ్రీవారి మెట్టు నడక దారి మూసివేత

by srinivas |
Breaking: శ్రీవారి మెట్టు నడక దారి మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి మెట్టు నడక దారిని రేపు మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) ప్రకటించారు. వర్షాల పడుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల ఘాట్ రోడ్డు(Ghat Road)లో కొండచరియలు పడే అవకాశం ఉండటంతో నడక దారిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డులో కొండచరియల(Landslides)పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వర్షం పడుతున్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed