భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ సాహసం

by Mahesh |   ( Updated:2024-09-15 17:27:39.0  )
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ సాహసం
X

దిశ, చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ వి జితేష్ పాటిల్ సాహసం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు చండ్రుగొండ మండలం బెండల పాడు అడవి ప్రాంతానికి చేరుకొని ఎనిమిది కిలోమీటర్లు అడవి మార్గంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి పల్లేరు వీరభద్రస్వామి ఆలయంతో పాటుగా.. అటవీ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఏ అధికారికి కూడా సమాచారం ఇవ్వకుండా స్వయంగా ఆయన అక్కడే గ్రామస్తులను వెంట తీసుకొని అడవిలోకి వెళ్లడం విశేషం.

Advertisement

Next Story