ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగన్ ప్రభుత్వమే.. కుండబద్దలు కొట్టిన కేసీఆర్

by Disha Web Desk 2 |
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగన్ ప్రభుత్వమే.. కుండబద్దలు కొట్టిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగన్‌ ప్రభుత్వమే రాబోతోందనే సమాచారం తనకు ఉందని స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు.. అందుకే వాటి జోలికి తాను వెళ్లడం లేదని అన్నారు. ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని చెప్పారు. అంతకుముందు ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్‌ ఏమీ లేదని.. అసలు అది స్కామ్‌ కాదని.. నరేంద్ర మోడీ పొలిటికల్‌ స్కీమ్‌ అని మండిపడ్డారు. లిక్కర్‌ పాలసీ ఢిల్లీ ప్రభుత్వానిది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది. ఇది స్కామ్‌ ఎలా అవుతుంది. ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన నా కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఎక్కడా ఒక్క రూపాయి రికవరీ చేయలేదని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైలులో పెట్టారు.. బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.. ఇంతకింత మోడీ అనుభవిస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed